పల్లె దవాఖానా కు ఎంపికైన 19 మంది వైద్యులకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ కుమార్ నియామక పత్రాలను అందచేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలోని ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించే ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు.
వైద్య సేవలు పల్లెల్లోనే అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతిష్టాత్మకంగా పల్లె దవాఖానాలను ప్రవేశ పెట్టిందన్నారు. వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేసి పల్లెలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సుధాకర్ లాల్, ఇమ్మునైజెషన్ అధికారి డా.సాయినాథ్ రెడ్డి పాల్గొన్నారు.