38.2 C
Hyderabad
April 29, 2024 14: 11 PM
Slider మహబూబ్ నగర్

శ్రీపురం రంగనాయక స్వామి ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్

#nagarkurnoolcollector

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పీ ఉదయ్ కుమార్ నాగర్ కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామం లో వేంచేసి ఉన్న రంగనాయక స్వామి ని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. గురువారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆయన ఎస్పీ మనోహర్ తో కలిసి శ్రీపురం రంగనాయక స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్, ఎస్పీలకు భాజా భజంత్రీల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదపండితులు తీర్థప్రసాదాలు శేష వస్త్రాలను అందజేశారు. ఆలయ చరిత్రను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రంగాచార్యులు, వినోద్, ఆర్డీవో నాగలక్ష్మి శ్రీపురం గ్రామ సర్పంచ్ మైన గాని నిరంజన్, ఆలయ కమిటీ సభ్యులు మల్లికార్జున్ నరసింహారెడ్డి గంధం ప్రసాద్ గోపీనాథ్ రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

త్యాగ‌ధ‌నుల స్పూర్తి ఎప్పుడూ మ‌ర్చిపోకూడ‌దు….!

Satyam NEWS

108 డ్రైవర్లకు అదనపు పారితోషికం ఇచ్చిన కలెక్టర్

Satyam NEWS

సినీ పరిశ్రమపై పిడుగు: ఇక కలెక్షన్లన్నీ ప్రభుత్వం చేతికే

Satyam NEWS

Leave a Comment