నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పీ ఉదయ్ కుమార్ నాగర్ కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామం లో వేంచేసి ఉన్న రంగనాయక స్వామి ని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. గురువారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆయన ఎస్పీ మనోహర్ తో కలిసి శ్రీపురం రంగనాయక స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్, ఎస్పీలకు భాజా భజంత్రీల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదపండితులు తీర్థప్రసాదాలు శేష వస్త్రాలను అందజేశారు. ఆలయ చరిత్రను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రంగాచార్యులు, వినోద్, ఆర్డీవో నాగలక్ష్మి శ్రీపురం గ్రామ సర్పంచ్ మైన గాని నిరంజన్, ఆలయ కమిటీ సభ్యులు మల్లికార్జున్ నరసింహారెడ్డి గంధం ప్రసాద్ గోపీనాథ్ రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
previous post