కరోనా పాజిటీవ్ కేసులను హైదరాబాద్ కు తరలించినందుకు 108 వాహనాల డ్రైవర్ లకు ఒక్కొక్కరికి 5వేల చొప్పున నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ అందించారు. కరోనా పాజిటీవ్ రోగులకు సేవ చేసే క్రమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయని 108 వాహన డ్రైవర్లను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, డిఎం ఎచ్ ఓ వసంత్ రావు, డా,దేవేందర్ రెడ్డి, కార్తీక్ తదితరులు కూడా పాల్గొన్నారు.
previous post