గురుపూజోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు గా ఎన్నికైన జి హెచ్ ఎం మూలే చంద్రకళ కు మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలె కేశవులు అభినందనలు తెలిపారు. నీటిపారుదల శాఖ లో పని చేస్తున్న మూలె దామోదర్ భార్య అయిన చంద్రకళ దేవరకద్రలో ప్రభుత్వ పాఠశాల లో ప్రధాన ఉపాధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్నారు.
తోటి ఉపాధ్యాయులతో ఆప్యాయతతో కలిసి ఉంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వారసురాలిగా ఆమె ఆదరాభిమానాలను పొందారని ఆయన తెలిపారు. గురువుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కావడం పట్ల అభినందిస్తూ భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు ఎన్నో అందుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.