38.2 C
Hyderabad
April 29, 2024 11: 28 AM
Slider ముఖ్యంశాలు హైదరాబాద్

అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

akbaruddin-owaisi

రెచ్చగొట్టిన ప్రసంగాలు చేసినందుకు అక్బరుద్దీన్ ఓవైసీ పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కరీంనగర్ సభతో పాటు బీహార్ లోని పలు ప్రాంతాలలో విద్వేషాలు రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగాలు చేశారంటూ అడ్వకేట్ కరుణ సాగర్ నాంపల్లి కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.15 నిముషాలు సమయం ఇస్తే వంద కోట్ల మంది అంతు చూస్తాను అంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్, ఎన్నికల సమయంలో మరో మూడు సార్లు ఆ  అంశాన్ని ప్రస్తావించాడని ఆగస్టు లో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో 15 నిమిషాల వ్యాఖ్యలపై కండిషన్ బెయిల్ పై ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి కోర్ట్ ఉత్తర్వులు ఉల్లగించారంటూ పిటిషనర్ వాదనలు వినిపించారు. నిర్మల్ లో నమోదైన FIR , ఆడియో, వీడియో, తో పాటు కండిషన్ బెయిల్ ఆర్డర్ ను కూడా పిటిషనర్ ప్రస్తావించారు. దాంతో అక్బరుద్దీన్ ఓవైసీ పై వెంటనే కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు హైదరాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Related posts

ఇంటర్వెల్: కరోనా భయంతో బయటకు రాని బడా హీరోలు

Satyam NEWS

రైతుబిడ్డ రాష్ట్రానికి నాయకుడైతేనే రైతులకు సంక్షేమ పథకాలు

Satyam NEWS

32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ

Satyam NEWS

2 comments

Subbarao November 21, 2019 at 10:39 PM

Satyamurty garu Asaduddin photo pettaru Akbsruddin photo pettali. Chsusi marchandi

Reply
Satyam NEWS November 21, 2019 at 11:59 PM

I am very sorry, I am changing it

Reply

Leave a Comment