రెచ్చగొట్టిన ప్రసంగాలు చేసినందుకు అక్బరుద్దీన్ ఓవైసీ పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కరీంనగర్ సభతో పాటు బీహార్ లోని పలు ప్రాంతాలలో విద్వేషాలు రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగాలు చేశారంటూ అడ్వకేట్ కరుణ సాగర్ నాంపల్లి కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.15 నిముషాలు సమయం ఇస్తే వంద కోట్ల మంది అంతు చూస్తాను అంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్, ఎన్నికల సమయంలో మరో మూడు సార్లు ఆ అంశాన్ని ప్రస్తావించాడని ఆగస్టు లో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో 15 నిమిషాల వ్యాఖ్యలపై కండిషన్ బెయిల్ పై ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి కోర్ట్ ఉత్తర్వులు ఉల్లగించారంటూ పిటిషనర్ వాదనలు వినిపించారు. నిర్మల్ లో నమోదైన FIR , ఆడియో, వీడియో, తో పాటు కండిషన్ బెయిల్ ఆర్డర్ ను కూడా పిటిషనర్ ప్రస్తావించారు. దాంతో అక్బరుద్దీన్ ఓవైసీ పై వెంటనే కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు హైదరాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
previous post
2 comments
Satyamurty garu Asaduddin photo pettaru Akbsruddin photo pettali. Chsusi marchandi
I am very sorry, I am changing it