లలిత కళల్లో విశేష ప్రావీణ్యం ఉన్నవారిని సి.సి టి.వి, ఎఫ్.సి.సి 24 క్రాఫ్ట్స్, విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ వారు నంది అవార్డులతో సత్కరించారు.
సంగీతం, నాట్యం,సాహిత్యం, గాత్రం, అభినయం, క్రీడలు, సామాజిక సేవా ఇతరత్రా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు.
ఇందులో భాగంగా ములుగు జిల్లా చల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు చల్లగురుగుల మల్లయ్య కు నంది జాతీయ పురస్కారం-2021 దక్కింది.
విజయవాడ గాంధినగర్ లోని వెలిదండ్ల హనుమంతరావు గ్రంథాలయ ప్రాంగణంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన నంది అవార్డును అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ ఆరవల్లి నరేంద్ర, డాక్టర్ సువర్ణకుమారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయో డైవర్సిటీ బోర్డు మెంబర్ వరలక్ష్మీ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
కే.మహేందర్ గౌడ్, సత్యం న్యూస్