42.2 C
Hyderabad
April 30, 2024 17: 58 PM
Slider చిత్తూరు

రేణిగుంట విమానాశ్రయంలో నేలపై కూర్చుండిపోయిన చంద్రబాబు

#Chandrababu

కరోనా నిబంధనల పేరుతో తన నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

రేపు 5వేల మందితో చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు తెలుగుదేశం నేతలు పోలీసులను అనుమతి కోరారు. 

కోవిడ్ దృష్ట్యా, గాంధీ బొమ్మ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగే అవకాశం ఉండడంతో చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి అనుమతి నిరాకరించారు.

అలాగే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల కూడా ఇన్ని వేల మంది ర్యాలీలు నిరసనలు చేయడానికి అనుమతి ఇవ్వలేమని తెలిపారు.

దాంతో నేడు రేణిగుంట విమానాశ్రయంలో నేలపై బైఠాయించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిరసన తెలిపారు.

రేణిగుంట పోలీసులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు.

Related posts

టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి కి అవమానం…

Satyam NEWS

దుబ్బాకలో ట్రబుల్ మేకర్లను బైండోవర్ చేయండి

Satyam NEWS

పోలీసు శాఖలో కీలక పోస్టు భర్తీ కావడం లేదు ఎందుకో…?

Satyam NEWS

Leave a Comment