APUWJ, IJU పిలుపు మేరకు గుంటూరు జిల్లా జర్నలిస్టు యూనియన్ నేతలు నరసరావుపేట ఎంపీ కృష్ణ దేవరాయలు కి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల కి 50 లక్షల ప్రమాద భీమా కల్పించాలని, కరోనా వచ్చిన జర్నలిస్టులకు 25000, ప్రతి జర్నలిస్ట్ కి కరోనా నేపధ్యంలో 15000 ఆర్ధిక సహాయం ఇవ్వాలని, అలాగే చనిపోయిన ముగ్గురు జర్నలిస్టుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ జిల్లా నేతలు కోరారు.
ఎంపీ మాట్లాడుతూ మీ న్యాయపరమైన డిమాండ్స్ ప్రధాని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, తక్షణమే సమాచార శాఖ మంత్రితో మాట్లాడతాన్నారు. ఎంపీ కి వినతిపత్రం ఇచ్చిన వారిలో జిల్లా అధ్యక్ష,కార్యదర్శి లు sn మీరా, యేచూరి శివ,రాష్ట్ర నేతలు భాస్కర్ రెడ్డి,గిరి,మోహన్ రావు,ఎక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు రాంబాబు, చిన్న పేపర్స్ రాష్ట్ర నాయకులు మల్లెల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.