కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో స్థానిక సంస్థలకు ఇచ్చే దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీ కరణ్ పురస్కారానికి సంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్తు ఎంపిక కావడం పట్ల ఆర్థిక మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.
ఇవాళ సంగారెడ్డి జిల్లా పరిషత్తు ఛైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జెడ్పీ సీఈవో ఎల్లయ్య , ఇతర అధికారులు మంత్రి హరీశ్ రావును హైదరాబాద్ లో ఆయన నివాసంలో కలిశారు.
అవార్డు సాధించే దిశగా జిల్లా పరిషత్తు సిబ్బంది చేసిన కృషిని ఆయన అభినందించారు. ఈ అవార్డు సాధించడంలో భాగస్వామ్యులయిన ప్రతీ ఒక్కరు అభినందనీయులన్నారు.
ఇదే దిశగా జిల్లాపరిషత్తు ముందుకు పోవాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని వారిని కోరారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పరిషత్తు ఛైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డిని శాలువాతో సత్కరించారు.
మరిన్ని జాతీయ అవార్డులు సాధించాలని, ప్రజలకు అన్ని విధాలుగా ఉత్తమ సేవలు అందించేలా కృషి చేయాలని వారికి మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.