జిల్లాలో జాతీయ రహదారి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కలెక్టర్ ఛాంబర్లో జీఎం, టెక్నీకల్, జాతీయ రహదారుల ప్రధాన కార్యాలయం, న్యూఢిల్లీ అజయ్ భర్గోటి తో కలిసి అధికారులతో జాతీయ రహదారుల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జీఎం తో నాగపూర్- అమరావతి జాతీయ రహదారి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అమరిక మార్పు, ఖమ్మం -బోనకల్ రహదారిపై చర్యలకు తెలిపారు. జాతీయ రహదారుల అధికారులు, రోడ్లు భవనాల శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి తగు పరిష్కారం చూపాలని జీఎం అన్నారు. రహదారుల విస్తరణకు భూ సేకరణ ప్రక్రియ వేగం చేయాలన్నారు. భూసేకరణకు అవార్డ్ పాస్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జాతీయ రహదారుల పిడి దుర్గాప్రసాద్, రోడ్లు, భవనాల శాఖ ఇఇ శ్యామప్రసాద్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post