ఈ నెల 10 న కామారెడ్డిలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో కలిసి వచ్చి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారని, అదేరోజు బహిరంగ సభలో బిసి డిక్లరేషన్ ప్రకటిస్తారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కామారెడ్డితో నాకు 34 సవత్సరాల అనుబంధం ఉందన్నారు. కేసీఆర్ పై అధిష్ఠానం నిర్ణయం మేరకు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నాడని తెలిపారు. మైనార్టీలకు రిజర్వేషన్ పేరుతో కేసీఆర్ మోసం చేశారన్నారు. బిసి సీఎం చేస్తాం అని చెప్తున్న బీజేపీ బిసి అధ్యక్షుడు బండి సంజయ్ ని ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రమణారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విత్ డ్రా అయ్యారని గుర్తు చేశారు. ఈ నెల 9 నాడు నిజామాబాదులో తాను నామినేషన్ వేస్తున్నానని, అదే రోజు హైదరాబాద్ లో మైనారిటీ డిక్లరేషన్ చేయబోతున్నామన్నారు. 10 వ తేదీన రేవంత్ రెడ్డి నామినేషన్ వేస్తారని, లక్ష మందితో కామారెడ్డిలో బహిరంగ సభ ఉంటుందన్నారు. సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
సత్యం న్యూస్, కామారెడ్డి