ప్రతి ఏటా లాగానే ఈ సారి కూడా గుంటూరు జిల్లా నకరికల్లులోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నుండి బైరెడ్డి వెంకటరెడ్డి భక్త బృందం విజయవంతంగా తిరుపతి పాదయాత్ర చేసింది. ఈ భక్త బృందం ఈ నెల 17 వ తేదీన పాదయాత్ర ప్రారంభించి నేడు తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నట్లుగా బైరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
ఈ పాదయాత్రలో ఆయనతో పాటు బండి సుబ్బారావు, బండి సాంబయ్య, బండి వరప్రసాద్, బండి తరుణ్ సాయి, ఢీకొండ శ్రీనివాసరావు, ఢీకొండ లక్ష్మినారాయణ, గోపిశెట్టి వెంకనర్సయ్య, గాసి శ్రీను, మొగిలి రవీంద్రబాబు, చింతా పుల్లయ్య, పానాది శ్రీనివాసరావు, పానాది రాంబాబు, రావు కొండలు, రుసుం వెంకటేశ్వర్లు, ఢీకొండ సాంబయ్య, ఢీకొండ మణికంఠ, శీలం నారాయణ ఉన్నారు.
ఈ సందర్భంగా బైరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నకరికల్లు నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్ర తో వెళ్తామని చెప్పారు. ఇప్పటికి 12 సార్లు నకరికల్లు నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్ర ద్వారా వెళ్లామని ఆయన అన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది కోడె దూడను శ్రీవారి గోశాలకు దానంగా ఇచ్చామని అన్నారు. చాలా సంతోషంగా పాదయాత్రను కొనసాగించామని ఆయన వెల్లడించారు.