29.7 C
Hyderabad
May 3, 2024 05: 42 AM
Slider మహబూబ్ నగర్

ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

#netaji

పరాక్రమ దివాస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు కల్వకుర్తి పట్టణంలో ఘనంగా  నిర్వహించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో వివిధ  పార్టీ నాయకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా పాఠశాలల్లో  ఉపాధ్యాయులు  భారత స్వతంత్రం కోసం సుభాష్ చంద్రబోస్ చేసిన కృషిని కొనియాడుతూ ఆయన 126వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. భారత స్వతంత్ర యోధుడు ఆజాద్ హిందు ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న వారికి పండ్లు పాలు పంపిణీ చేశారు.

Related posts

దగ్గు మందును మత్తు మందులా అమ్ముతున్నాడు

Satyam NEWS

షిరిడి సాయి బాబా మందిరంలో రధసప్తమి వేడుకలు

Satyam NEWS

కాప్రా సర్కిల్లో ఇష్టారాజ్యంగా  రోడ్డు కటింగ్ లు

Satyam NEWS

Leave a Comment