విజయనగరం జిల్లాకు మరో మహిళా అధికారిణి వచ్చారు. జిల్లాకు కొత్త కలెక్టర్ గా సూర్యకుమారిని రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చిన సంగతి విదితమే. తొలుత సింహాచలం దేవస్థానం లో సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఐఏఎస్ సూర్యకుమారీ…నేరుగా ఉదయం పదిన్నర ప్రాంతంలో నగరంలోని శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని భర్తతో కలిసి దర్శనం చేసుకున్నారు.
ఉదయం 9.30 గంటలకు అమ్మవారిని దర్శించుకుంటారని జిల్లా పౌర సంబందాల,సమాచార శాఖ సమాచారం ఇవ్వడంతో…మీడియా అంతా..తొమ్మిది గంటలకే దేవస్థానికి చేరుకుంది. కానీ గంట తర్వాత అమ్మవారిని దర్శించుకునేందుకు కలెక్టర్ సూర్యకుమారీ వచ్చారు. ఇక దేవస్థానం ఈఓ కిషోర్ కుమార్, రమణమూర్తి, శ్రీనివాసరావులు పూర్ణకుంభంతో కలెక్టర్ ను స్వాగతం పలికి గర్భాలయంలోని తీసుకెళ్లారు.
కలెక్టర్ సూర్యకుమారీ అమ్మవారికి పసుపు కుంకుమ,పట్టుచీర,గాజులు అమ్మవారకి సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు…సూర్యకుమారీ దంపతులకు వారి గోత్ర నామాలతో సంకల్పం చెప్పి మరీ ప్రత్యేక పూజలు చేసారు.
అనంతరం కలెక్టర్ దంపతులను ఆలయ మండంపలో కూర్చొబెట్టి ఆలయ అర్చకులు..వేద మంత్రోఛ్చారణలతో ఆశీర్వదించగా..ఆలయ ఈఓ కిషోర్ కుమార్..తీర్ధ ప్రసాదాలు ఇచ్చారు. అక్కడ నుంచీ కలెక్టర్ సూర్యకుమారీ నేరుగా జిల్లా పరిహత్ అతిథి గృహానికి వెళ్లిపోయారు.