మీ టీవీ బాగుందండీ ఎంత పెట్టి కొన్నారేంటి? అని ప్రశ్నించేవారికి 14 లక్షల రూపాయలు పెట్టి టీవీ కొన్నాం అంటే నమ్మరేమో కదా. కానీ ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితి ఉంది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ రూ.13,99,990విలువ గల ఎల్ఈడీ టీవీ, జెడ్ 8 హెచ్ ని మార్కెట్ లో విడుదల చేసింది. 85 అంగుళాల పొడవు, 8కేఎల్ ఈడీ టీవీ 7680 x 4320 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్తో దేశంలో ఇదే అత్యంత ఖరీదైన టీవీ.
ఈ ‘రెడీ ఫర్ ప్లేస్టేషన్ 5’ ఈ ఏడాది నవంబర్లో మార్కెట్ లోకి విడుదల అవుతున్నది. సోనీ జెడ్ 8 హెచ్ శక్తివంతమైన ప్రాసెసర్ తో పలు రకాల ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
రిఫ్రెష్ రేటు అల్ట్రా HD రిజల్యూషన్ వద్ద 120Hz వరకు వెళ్ళవచ్చు. ఇది లోకల్ డిమ్మింగ్తో పాటు ఎక్స్-టెండెడ్ డైనమిక్ రేంజ్ ప్రో తో పాటు ఫుల్-అర్రే ఎల్ఇడి-బ్యాక్లిట్ డిస్ ప్లే వస్తుంది.
టీవీ వెనుక భాగంలో నాలుగు హెచ్డిఎంఐ పోర్ట్లను కనెక్టివిటీ కోసం మూడు యుఎస్బి పోర్ట్లను అందిస్తుంది.