తెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేవారు మూడో రోజు కూడా వెల్లువలా వస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కాలువ సుజాత నేడు రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయనకు వేంకటేశ్వర స్వామి భారీ క్యాలెండర్ ను బహూకరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా పాలించే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని దానికి రేవంత్ రెడ్డి సారధ్యమే సరైనదని ఈ సందర్భంగా సుజాత అన్నారు. త్వరలో జరగబోయే మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయపథంలో నడుస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.