నిర్భయ దోషుల్లో భయం దైన్యత కనపడుతుంది.నిర్భయ కేసులో దోషులుగా ఉరిశిక్ష అనుభవించ బోతున్న నలుగురు దోషులను తమ చివరి కోరిక గురించి అధికార వర్గాలు ప్రశ్నించగా మౌనం గా ఉండిపోయారని తెలిపారు.మాట రాక దీనం గా చూస్తూ త్వరలో తాము చనిపోతామనే వేదన వారిలో కన్పిస్తోందని తెలిసింది. ఫిబ్రవరి 1 న ఉదయం 6 గంటలకు వీరిని ఉరితీస్తారు.
తాజా పరిణామం ప్రకారం ఉరిశిక్షకు ముందు వారి చివరి కోరిక గురించి అడిగినప్పుడు నలుగురు మౌనంగా ఉన్నారు. ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ కుమార్ గుప్తా, అక్షయ్ సింగ్ అనే నలుగురు దోషులను మీరు మీ కుటుంబాన్ని కలవాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు వారు సమాధానం ఇవ్వలేదు.
మీ ఆస్తిని ఎవరికైనా వదిలేయాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు కూడా దోషులు సమాధానం ఇవ్వలేదని అధికారులు చెప్పారు .వారికి సంవాదం చెప్పడానికి నోరు పెగలడం లేదని ఓకే అధికారి బాధాగా తెల్పినట్లు సమాచారం