జాతీయ రహదారి పనులను చేపడుతున్న డి బి ఎల్ కంపనీలో పనిచేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కార్మికులను పట్టించుకోకుండా వదిలివేయడంతో సోమవారం రాత్రి 50 మంది కార్మికులు కాలినడకన బిచ్కుంద నుండి జార్ఖండ్ కు బయలు దేరారు.
గమనించిన స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో రెవెన్యూ అధికారులు బిచ్కుంద గ్రామంలో కార్మికులను అడ్డుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారని అధికారులు కార్మికులను ప్రశ్నించగా జార్ఖండ్ రాష్ట్రం నుంచి పనుల నిమిత్తం డి బి ఎల్ కంపెనీలో గత సంవత్సరం నుండి పనిచేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం లాక్ డౌన్ నియమించడంతో యాజమాన్యం పట్టించుకోకుండా వదిలేశారని గత్యంతరం లేక కాలినడకన జార్ఖండ్ రాష్ట్రంలోని గద్ వాడ్ జిల్లాలోని తమ నివాస గ్రామానికి ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేక కాలినడకనే బయలుదేరమని తెలిపారు.
వెంటనే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది డి బి ఎల్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు కార్మికులను ఇలా వెళ్లిపొమ్మని వదిలి వేయడం సమంజసం కాదని కార్మికులను వెనుకకు రప్పించుకోక పోతే కేసు నమోదు చేస్తామని తెలపడంతో వెంటనే వాహనం పంపించి కార్మికులను డి బి ఎల్ కంపెనీ ప్రాంగణంలో కి తీసుకెళ్లారు. కార్మికులతో పనులు చేయించుకుని రోడ్డుపై వదిలివేయడం ఎంతవరకు సమంజసమని డి బి ఎల్ కంపెనీ యాజమాన్యం పై కేసు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు.