కాచిగూడ డివిజన్ లోని చెప్పల బజార్ మోతీ మార్కెట్, నింబోలి అడ్డ, ఎం.ఎ నగర్, వీరన్న గుట్ట, బర్కత్ పుర తదితర ప్రాంతాల్లో ప్రతిరోజు చెత్త సేకరించే ఆటో లు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్ అన్నారు.
ఈ విషయంపై జీహెఎంసీ అధికారులు జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎ. ఎం. హెచ్.ఓ హేమలతలను పిలిపించి వారి వారి సమక్షంలో ఆటో డ్రైవర్లతో చర్చించి కరోణ వ్యాధి విజృంభిస్తున్న దృశ్య ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ జీహెఎంసీ ఎస్.ఎఫ్.ఎలు, బీ.జే. పీ సీనియర్ నాయకులు కన్నె రమేష్ యాదవ్, మల్లికార్జున్, ఆర్. సంతోష్ కుమార్, రాము, భీమ్ రాజ్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.