నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నరసింహామయ్య ఆకస్మిక మృతి పట్ల బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మరణం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీరని లోటని బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ప్రజా సమస్యలపై జీవితాంతం పోరాటం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారని, పేద, కార్మిక వర్గాల సంక్షేమం కోసం నోముల అంకితభావంతో పని చేశారని డీకె అరుణ కొనియాడారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు డీకే అరుణ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
next post