30.7 C
Hyderabad
April 29, 2024 05: 05 AM
Slider ప్రత్యేకం

కేసీఆర్ గారూ.. ఎన్నారై పాలసీ ఇవ్వండి

#NRIpolicy

జిడబ్ల్యూఏసీ బహ్రెయిన్ శాఖ జనరల్ సెక్రటరీ బండ సురేందర్ రెడ్డి

గల్ఫ్ బాధితుల కోసం సీఎం కెసీఆర్ ప్రకటించిన ఎన్నారై పాలసీ ఇవ్వాలని గల్ఫ్ కార్మికుల అవగాహన సంస్థ బహ్రెయిన్ శాఖ జనరల్ సెక్రటరీ బండ సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. బాధితుల సంక్షేమ సంఘం  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం ఎంతో  మంది అమర వీరులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడినందు వల్ల నేడు మనకంటూ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు.

ఆ రాష్ట్రానికి ఒక మంత్రి వర్గం, పరిపాలన అనేది ఏర్పడిందని, అయినా కూడా నేడు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన మన దేశ పౌరులు నేటికి ఇంకా ఎన్నో బాధలు పడుతున్నారన్నారు. వలస వెళ్లి  తిండి లేక, ఉందామంటే సదుపాయాలు లేక, తిరిగి వద్దామంటే చేతిలో డబ్బులు లేక, చాలి  చాలని బ్రతుకులతో తమ జీవితాన్ని గడుపుతున్న గల్ఫ్ సోదరులకు ధన్యవాదాలు తెలిపారు.

ఎన్ని బాధలు ఉన్నా ఏదో ఒక రోజు తాము కలలు కన్న రాష్టం తమను ఆదుకోదా అనే ధీమాతో ఉన్నారని తెలిపారు. వారు పెట్టుకున్న ఆశలను సీఎం కేసీఆర్ పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా సీఎం గారు.. మీ ప్రభుత్వం ఏర్పడక ముందు మీరు మా గల్ఫ్ అన్నలకు చేసిన వాగ్ధానాలు మరిచి పోయారా..? అని ప్రశ్నించారు. గల్ఫ్ లో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం కోసం మీరు ఇస్తానన్న 500 కోట్ల రూపాయలు ఎటు పోయాయని నిలదీశారు.

తాము కలలు కన్న సొంత రాష్టంలో తమకంటూ ఒక గుర్తింపు లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఇంకెన్ని రోజులు.. మా బాధలు మీకు అర్తం కావడం లేదా.. ఏ విషయాన్ని అయినా తేగే దాకా లాగద్దు అంటారు కానీ మా గల్ఫ్ అన్నల విషయంలో మీరు ప్రవర్తించే విదానం మాత్రం అలానే ఉందన్నారు. ఇకనైనా ఆలోచించండి సీఎం గారు.. మేము కూడా మీ ప్రభుత్వాల్లో, మీ పరిపాలనలో ఒకరిమేనని గుర్తుంచుకోవాలని కోరారు. వెంటనే ఎన్నారై పాలసీ అమలు చేసి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని కోరారు.

Related posts

విద్వేషం రగిల్చే ప్రసంగం కేసులో అక్బరుద్దీన్ కు నాంపల్లి కోర్టు ఊరట

Satyam NEWS

బావ మీద కోపంతో బాలకృష్ణ సినిమాకు అడ్డంకులు

Bhavani

ప్రజా సమస్యలపై ఇంటింటికి తెలుగుదేశం

Satyam NEWS

Leave a Comment