27.7 C
Hyderabad
April 26, 2024 05: 47 AM
Slider విజయనగరం

విజయనగరంలో ఘనంగా ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం

#AshokGajapathiRaju

విజయనగరంలో కోట.జంక్షన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐవీపీ రాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు.

అనంతరం మీడియా తో కేంద్ర మాజీమంత్రి పార్టీ సీనియర్ నేత అశోకగజపతి మాట్లాడారు. తెలుగు భాష ,సంస్కృతి కి స్వర్గీయ ఎన్టీఆర్ ఎనలేని కృషిచేసారని అన్నారు.

అయితే అశోకగజపతి మైక్ లో మాట్లాడుతున్న సమయంలో మైక్ మోరాయించింది. అశోక్ మాట్లాడుతున్న సమయంలో మూడుసార్లు మైక్ లో సాంకేతిక అంతరాయం ఏర్పడింది.

దీంతో మైక్ లేకుండా మాట్లాడాలని మీడియా కోరడంతో మైక్ లేకుండా నే అశోకగజపతి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో అశోక్ గజపతి కుమార్తె ఆదితీ , విజ్జపు ప్రసాద్, కనకల మోహనరావు ప్రసాదుల కనకమహాలక్ష్మి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

తాళ్ళపాక‌ శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

Satyam NEWS

సరెండర్:ఎస్పీఎదుట లొంగిపోయిన మావోయిస్టు

Satyam NEWS

ఎమ్మెల్యేలతో బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

Satyam NEWS

Leave a Comment