కువైట్ లోని యన్టీఆర్ సేవా సమితి వ్యవస్థాపకుడు చుండు బాలరెడ్డయ్య ఆధ్వర్యంలో కడప జిల్లా రాజంపేట లో పరిసర ప్రాంతాల్లో కోవిడ్ మూలంగా ఆహారం లేని పేదలకు ఈనెలలో మూడు సార్లు అన్న వితరణ గావించారు.
చుండు బాలరెడ్డయ్య కువైట్ లోనే అక్కడ జీవన భృతి సాగిస్తూ రాజంపేటలో ఉన్న తన మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తూ అన్న దానం చేసి ఎన్టీఆర్ కుటుంబంపై అభిమానాన్ని చాటుకుంటూనే తన సహృదయాన్ని చాటుకున్నాడు.
గత నెలలో రెండు సార్లు చికెన్ బిరియాని పంపిణీ వీరు శుక్రవారం రాత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా రాజంపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో యాఛకులకు, పుట్ పాత్ మీద వున్న వారికి కువైట్ ఎన్టీఆర్ యువత ఆద్వర్యంలో అన్న దానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమము లొ ఎన్టీఆర్ కేశవ,శ్రీను,శివ,దుగ్గినేని చంద్రబాబు నాయుడు, శ్రీహరినాయుడు, లక్ష్మినారయణ,రవి,మళ్లీ,వెంకటసుబ్బయ్య నందమూరి అభిమానులు పాల్గొన్నారు.