హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే పై నకిరేకల్ శివారులో నర్సింగ్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు కాగా , క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బాదితులు సూర్యాపేట పీజీఎఫ్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు కాగా, నల్గొండకు వెళ్తుండగా ఘటన జరిగింది. బస్సు ఫిట్ నెస్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని అనుమానం వ్యక్తం అవుతున్నది. ఘటనపై పోలీసు లు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
previous post