ముదిమి వయస్సు లో..రాలిపోయే పండుటాకులు..వికలాంగుల స్థితిలో వృద్ధ దంపతులు.. మీరు చూసిన వీళ్ల స్థితి ఇది.
విజయనగరం జిల్లా రామభద్రపురం ఆరికతోటకు చెందిన ఈ భార్యాభర్తల పేర్లు..విజయ్ ,లక్ష్మిలు.దాదాపు పుష్కర కాలం అంటే 12 ఏళ్ల క్రితం తమకు ఉన్న వరి భూమి కోసం ఇలా ఒకరికి ఒకరు తోడుగా.. అదీ నాకు నీవు…నీకు నేను మాత్రమే అనుకుంటూ…అప్పుడెప్పుడో అంటే దంపతులు కాని సందర్భంగా ఆలుమగల కోసం.. అడుగు లో అడుగేసుకుంటూ జీవితాంతం నాకు నువ్వు ..నీకు నేను అంటూ ప్రమాణం చేసిన గుర్తులు తలచుకుంటూ..ప్రస్తుతం ముదిమి వయస్సు ఆ బాసలను నెమరవేసుకుంటూ..నమ్ముకున్న అన్నం పెట్టే భూమి కోసం ఇలా కలెక్టరేట్ గుమ్మం తొక్కారు వృద్ధ దంపతులు.
సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఉన్న మా భూమి ని ఇప్పటికైనా ఇప్పించాలని ఇలా కలెక్టరేట్ స్పందనకు వచ్చారు. మరీ ఈ వృద్ధ దంపతులు మొరను కలెక్టరమ్మ ఏం జవాబిచ్చిందో..?