40.2 C
Hyderabad
April 29, 2024 17: 32 PM
Slider నల్గొండ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ అపూర్వ కలయిక

#oldstudents

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల కేంద్రంలోని వి.వి.హైస్కూల్ 1966-67 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థులు 45 సంవత్సరాల పిదప ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లి న్యూ క్లబ్ లో ఆదివారం సంతోష,సంబరాల నడుమ నిర్వహించారు.

ఈ సందర్భంగా 45 సంవత్సరాల తరువాత కలుసుకున్న శుభ సందర్భంగా మఠంపల్లి వి.వి.హైస్కూల్ నందు విద్యను అభ్యసించే రోజులలో జరిగిన మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు సహకరించుకుంటూ స్నేహం యొక్క విలువలను పెంచుతామని అన్నారు. ఒకరినొకరు తమ తమ యోగక్షేమాలను తెలుసుకున్నారు. అందరం ఒకచోట కలుసుకోవటం అమితమైన ఆనందాన్ని కలిగించిందని,అతి త్వరలోనే తాము విద్యను అభ్యసించిన మఠంపల్లి మండల కేంద్రంలోని వి.వి.హైస్కూల్ నందు సమావేశం ఏర్పాటు చేసుకుని, విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేసిన వి.వి.హైస్కూల్ అభివృద్ధి కొరకు తప్పక సహకరించి తమ ఋణం తీర్చుకుందామని అన్నారు.

ఈ అపూర్వ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో వంగవీటి వేణుగోపాలరావు,ముక్కా మధు,జి. కోటి రెడ్డి,తాటికొండ వెంకటరెడ్డి, తాటికొండ కృష్ణారెడ్డి,చంద్రశేఖర్, మన్నెం సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు

Bhavani

శాంతి ప్రతిజ్ఞ!

Satyam NEWS

మహిళా బాక్సర్ లోవ్లినా కు మానసిక వేధింపులు

Satyam NEWS

Leave a Comment