28.7 C
Hyderabad
April 28, 2024 05: 48 AM
Slider చిత్తూరు

ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు ఒకరు మృతి

#Road accedent

తిరుపతి- శ్రీకాళహస్తి ప్రధాన రహదారిలోని  ఏర్పేడు మండలం ఎఫ్ సి ఐ గోడౌన్ల సమీపంలో గురువారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీకాళహస్తి నుండి తిరుపతి వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాలను నిస్సాన్ కారు ఎదురు గా  రాంగ్ సైడ్ వచ్చి ఢీ కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

మృతిచెందిన చెందిన వ్యక్తి చిత్తూరుకు చెందిన శ్రీనివాసులు (45) గా గుర్తించారు. తిరుచానూరు  సమీపంలోని నక్కల వీధి లో సోషల్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గాయ పడిన వ్యక్తి పుత్తూరు మండలం పరిధిలోని కొండలచెరువు కు చెందిన ముని వేలు గా గుర్తించారు.

మృతి చెందిన శ్రీనివాసులు శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు .గాయపడిన ముని వేలు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఏర్పేడు సీఐ శివ కుమార్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

కామారెడ్డిలో ఓయూ జెఎసి చైర్మన్ సత్యనారాయణ భిక్షాటన

Satyam NEWS

21న ముఖ్యమంత్రి కేసిఆర్ వరంగల్ ఎంజిఎం సందర్శన

Satyam NEWS

ఆర్.సి.ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన కార్పొరేటర్ రజిత

Satyam NEWS

Leave a Comment