కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిధిలోని మైనూరు గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలవ్వగా మరొకరికి గాయాలు అయ్యాయి. దోతీ గ్రామానికి చెందిన రాజు పటేల్, మటo బసప్ప ద్విచక్ర వాహనంపై మైనూరు గ్రామం నుండి మద్నూర్ వైపు వస్తూ NH 161 హైవే ను దాటుతుండగా ప్రమాదం జరిగింది. డెగ్లూర నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఎర్టిగా కారు నెంబరు MH 08 AN 4844 అతివేగంగా వస్తు బైక్ ను ఢీ కొనగా వెనకాల కూర్చున్న బసప్ప అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రాజు పటేల్ ఎడమ చేయి ఎడమ కాలుకు గాయాలు అయ్యాయి. బసప్ప కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దీనిపై మద్నూరు ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.