హెడ్డింగ్ కరెక్టే. అడవి పందుల వేట కోసం నాటు బాంబులు తీసుకువెళుతున్నాడు ఒక వ్యక్తి. నాటు బాంబులను పోలీసులు పట్టుకుంటారేమోననే భయంతో వాటిని అండర్ వేర్ లో దాచుకున్నాడు. అయితే అతని ఖర్మ బాగా లేదు. ఉట్నూర్ క్రాస్ రోడ్డు వద్ద బైక్ అదుపు తప్పింది. సర్రున జారి కింద పడ్డాడు.
ఆ ఒరిపిడికి డ్రాయర్ లో పెట్టుకున్న నాటు బాంబులు పేలాయి. దాంతో అతను అక్కడికక్కడే ముక్కలై మరణించాడు. వెనకాల కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమం గా ఉంది. వీరిద్దరిని మహారాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది.