ఓరుగంటి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఓరుగంటి రెడ్డి కులస్తులను సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావును కోరారు. మంగళవారం ఉదయం ఉండవల్లి లోని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
19 94 లో అప్పటి ప్రభుత్వం నియమించిన పుట్టు స్వామి కమిషన్ కూడా ఓరుగంటి రెడ్డి కులస్తులు బీసీల్లో చేర్చడానికి అర్హులేనంటూ నివేదిక సమర్పించినప్పటికీ ఆచరణలో ప్రభుత్వాలు పట్టించుకోలేదని వారు తెలిపారు.
2017 లో మంజునాథ కమిషన్ కు రిజర్వేషన్ పోరాట సమితి ఓరుగంటి రెడ్డి కులస్తుల దగ్గర పరిస్థితులను జీవన వ్యవహారాలను సంప్రదాయాలను సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లతో నివేదిక సమర్పించినప్పటికీ ఈరోజు వరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చీరాల వచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఓరుగంటి రిజర్వేషన్ పోరాట సమితి కలిసి ఓరుగంటి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది అని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మోపిదేవి వెంకట రమణారావును కలిసిన వారిలో బక్క జయరామిరెడ్డి, మేడి బోయిన వెంకట్ రెడ్డి, నంగు వెంకటేశ్వర్ రెడ్డి, నాయుడు నాగార్జున రెడ్డి, దేవు రెడ్డిమ్మ, బక్క శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.