36.2 C
Hyderabad
April 27, 2024 21: 38 PM
Slider విశాఖపట్నం

కేసుల మాఫీ కోసం విశాఖ ఉక్కు పరిశ్రమ తాకట్టు

#AnitaTDP

కేసుల మాఫీ గురించి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి ధారదత్తం చేస్తున్నందువల్లే జగన్ రెడ్డి విశాఖ ఉక్కు గురించి మాట్లాడటం లేదని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత వ్యాఖ్యానించారు.

విశాఖపట్నంలో నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమకు ఒక చరిత్ర వుంది…ఇది తెలుగుప్రజలతో విడదీయలేని బంధం…విశాఖ చరిత్ర తెలిసినవారెవ్వరూ ఇలాంటి నిర్ణయం చేయరు….అంటూ వ్యాఖ్యానించారు.

అయితే విశాఖ ఉక్కుపై రాబందుల కన్నుపడిందనే అనుమానం కలుగుతోందని ఆమె అన్నారు. లక్ష కుటుంబాలు స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి జీవిస్తున్నాయని ఆమె తెలిపారు.

దిక్కుమాలిన ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోందని, ఏ1,ఏ2 లు అడుగు పెట్టిన మొదలు రాష్ట్రానికి దౌర్భాగ్యం పట్టిందని ఆమె అన్నారు.

ఉక్కు పరిశ్రమపై  ఐరన్ లెగ్ మోపారు… విశాఖ ను బ్రష్టు పట్టించాలని చూస్తున్నారు.. ఒక్క పరిశ్రమ తీసుకురాలేకపోయారు.. ఉక్కు పరిశ్రమనైనా కాపాడ్డానికి ముందుకు రావాలి…అని ఆమె కోరారు.

28 మంది ఎంపిలు వున్నా కూడా మీరు ఏం చేస్తున్నారు అంటూ ఆమె ప్రశ్నల వర్షం గుప్పించారు.

Related posts

ఆగస్టు నాటికి దేశంలో పది లక్షల కరోనా మరణాలు

Satyam NEWS

NRI ఆసుపత్రి లో భారీ స్కామ్: బయటపడ్డ రికార్డులు

Satyam NEWS

మునిగిన ఇళ్లకు పరిహారం పంచిన ఎమ్మెల్యే మాగంటి

Satyam NEWS

Leave a Comment