వైఎస్సార్ వర్ధంతి వేడుకల ను అన్నమయ్య జిల్లా రాజపేట పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ లో ఉన్నటువంటి దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల వద్ద ఆయన 14వ వర్ధంతి వేడుకలను ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ విగ్రహాలకు గజమాలను వేసి నివాళులర్పించారు. అనంతరం వర్ధంతి వేడుకలకు హాజరైన వారందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే మేడా స్వయంగా వడ్డించారు.
అనంతరం మీడియా సోదరులతో ఎమ్మెల్యే మేడ మాట్లాడుతూ వైయస్సార్ సేవలను కొనియాడారు. అంతకు ముందుగా జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆయన స్వగృహంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి, రాజంపేట మండల మరియు పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వార్డ్ కౌన్సిలర్లు ముఖ్య నాయకులు మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.