రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బిసి సీనియర్ నాయకులు పై వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-ఛార్జ్ డాllచదలవాడ అరవింద బాబు అన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం కళా వెంకట్రావు అరెస్టుకు నిరసన తెలియజేశారు.
బీసీ మాజీ మంత్రులు పై జరుగుతున్న అక్రమ అరెస్టులను ఆయన ఖండించారు. నాటకీయ పరిణామాల మధ్య తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కళా వెంకట రావు ను విజయనగరం పోలీసులు విచారణ పేరుతో అక్రమంగా తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం హేయమైన చర్య అని అన్నారు.
రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వైకాపా ప్రభుత్వం పాలన చేయడం తగదని ఆయన హెచ్చరించారు.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఇమిడిశెట్టి కాశయ్య,కొల్లి బ్రహ్మయ్య, పులిమి రామిరెడ్డి, వాసిరెడ్డి రవి, ఎన్నం శివారెడ్డి,బడే బాబు,శాఖమూరి మారుతి, యాడ్స్ వలి,మన్నన్ షరీఫ్,గడ్డం కరీముల్లా,
మీరవాలి, కోరనేపాటి సంజీవరావు, చల్లా సుబ్బారావు,పొత్తూరి శ్రీను, నాగూర్,రఫీ,కొంగర రమేష్,సుభాని,కావూరి శ్రీను, నజీర్, మస్తాన్, యర్రగుంట్ల రమేష్,సైదమ్మా,ఐలా గోపి,నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.