కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జగన్నాధపురం జుజ్జూరు గ్రామాల మధ్య గ్రామస్తులు స్వచ్ఛందంగా కంచె ఏర్పాటు చేసుకున్నారు. మా ఊరికి ఎవరు రావద్దు ఊరి నుండి మేము బయటికి రామంటూ స్వచ్ఛందంగా గ్రామస్తులు స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.
ఇరు గ్రామాల మధ్య రహదారి పైన అడ్డంగా ముళ్ళ కంచెలు చేసుకున్నారు. కరోనా వైరస్ ప్రబలితే ఆపలేమని అందుకే మా ఊరిని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు తెలిపారు.