సొంత నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే స్థానిక శాసనసభ్యుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం లోని కొత్తపల్లిలో త్రాగునీటికోసం కోసం వ్యవసాయ పొలాల నుండి నీళ్ల బిందెలు మోసే పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు.
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన సొంత నియోజకవర్గంలో త్రాగునీటిని ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి మూడు రాజధానులు కడతాడు అంట అని వారు ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇంటికి ఇంటికి కుళాయి ఇస్తానని ,చెప్పి మోసం చేశాడని మహిళలు ఆవేదన చెందుతున్నారని వారన్నారు. సొంత నియోజగవర్గ ప్రజలకే నీళ్లు ఇవ్వలేకుంటే రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తావ్ జగన్ రెడ్డి అని వారు ప్రశ్నించారు.
రాజధానుల పేరుతో మూడు ముక్కలాట, ఆడటం కాదు. ముందు నీ సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రజలు పడుతున్న అవస్థల్ని తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించు. నియోజకవర్గంలో రోడ్లు చూస్తే గుంతలమయమైన రోడ్లు కనిపిస్తుంన్నాయి. నిత్యావసర ధరలు ఆకాశానికి పెంచావు. అర్ధాకలిలో పేద ప్రజలు ఉండే పరిస్థితి ఏర్పడింది అంటూ వారు విమర్శలు గుప్పించారు.