కామారెడ్డి జిల్లా బిక్కనూర్ రైల్వే స్టేషన్ గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పేర్కొన్న విధంగా వింతైన ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా బిక్కనూర్ రైల్వే స్టేషన్ గ్రామంలో ఓ కుక్క పిల్ల పంది పాలు తాగుతున్న ఘటన స్థానికులను ముక్కున వేలేసుకునేలా చేసింది. సాధారణంగా పందులను చూస్తే కుక్కలు మొరుగుతూ వాటి వెంట పడతాయి. అలాంటి ఓ కుక్కపిల్ల తల్లిపంది పాలు తాగుతుండగా ఆ కుక్కపిల్లను దూరం కొట్టకుండా తన బిడ్డలాగే భావించిన ఆ తల్లి పంది మాతృత్వాన్ని పంచింది. ఒకచోట పడుకుని ఆ కుక్కపిల్లకు పాలు ఇచ్చింది. ఈ దృశ్యాన్ని అక్కడి స్థానికులు తమ ఫోన్లలో బంధించారు.
previous post