38.2 C
Hyderabad
April 28, 2024 19: 45 PM
Slider ముఖ్యంశాలు

తల్లి ప్రేమ చాటుకున్న వరాహం: కుక్కపిల్లకు పాలిచ్చిన పంది

#pig

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ రైల్వే స్టేషన్ గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పేర్కొన్న విధంగా వింతైన ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా బిక్కనూర్ రైల్వే స్టేషన్ గ్రామంలో ఓ కుక్క పిల్ల పంది పాలు తాగుతున్న ఘటన స్థానికులను ముక్కున వేలేసుకునేలా చేసింది. సాధారణంగా పందులను చూస్తే కుక్కలు మొరుగుతూ వాటి వెంట పడతాయి. అలాంటి ఓ కుక్కపిల్ల తల్లిపంది పాలు తాగుతుండగా ఆ కుక్కపిల్లను దూరం కొట్టకుండా తన బిడ్డలాగే భావించిన ఆ తల్లి పంది మాతృత్వాన్ని పంచింది. ఒకచోట పడుకుని ఆ కుక్కపిల్లకు పాలు ఇచ్చింది. ఈ దృశ్యాన్ని అక్కడి స్థానికులు తమ ఫోన్లలో బంధించారు.

Related posts

బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబ దేవి

Satyam NEWS

రేపు కేటీఆర్, రేవంత్ రెడ్డి రాక: హాట్ హాట్ గా కామారెడ్డి రాజకీయాలు

Satyam NEWS

నిధులు వచ్చేనా..? పనులు సాగేనా..?

Satyam NEWS

Leave a Comment