28.2 C
Hyderabad
December 1, 2023 17: 55 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

పప్పులో కాలేసిన కేంద్ర మంత్రి.. ఆడుకుంటున్న నెటిజన్లు

Piyush-goel-medium

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ పప్పులో కాలేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన ఓ వ్యాఖ్యలు నెటిజన్లకు ట్రోల్స్ చేసే అవకాశాన్నిచ్చాయి. ఆర్థికమందగమనం గురించి ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘లెక్కల గురించి మర్చిపోండి. లెక్కల వల్ల ఐన్‌స్టీన్ గ్రావిటీని (భూమి ఆకర్షణ శక్తి) గుర్తించలేదు.’ అని అన్నారు. అయితే, అక్కడే ఆయన తప్పులో కాలేశారు. అసలు గ్రావిటీని గుర్తించింది ఐన్‌స్టీన్ కాదు న్యూటన్. న్యూటన్ ఓ ఆపిల్ చెట్టు కింద కూర్చుని ఉండగా, పండు కింద పడడాన్ని చూసిన న్యూటన్.. అసలు ఆ పండు కిందకే ఎందుకు పడుతుందనే సందేహించారు. అలా, భూమ్యాకర్షణ శక్తి ఉందని కనిపెట్టారు. ఈ విషయం చిన్నప్పుడు సైన్స్ పాఠాల్లో కనిపిస్తాయి. అయితే, సాక్షాత్తూ కేంద్ర మంత్రి, గతంలో ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించిన పీయూష్ గోయాల్ ఇలా తప్పులో కాలేయడంతో నెటిజన్లు ఆయన మీద జోక్స్ వేస్తున్నారు.

Related posts

మూడు గంటల్లో లారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు

Satyam NEWS

ఉమ్మడి మాచారెడ్డిలో రేపు రేవంత్ రెడ్డి ప్రచారం

Satyam NEWS

భోగి రోజు మహిళలతో ఆడిపాడిన అంబటి రాంబాబుకు కరోనా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!