ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులుగా సీటు సంపాదించుటకు పలువురు పోటీ చేస్తున్న తరుణంలో మంగళవారం మార్కాపురం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఊడుముల కోటిరెడ్డి వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు వై.వి సుబ్బారెడ్డి ని కలవటం జరిగినది.ఈ సందర్భంగా ఉడుముల మాట్లాడుతూ మార్కాపురం శాసనసభ్యులుగా పోటీ చేయుటకు అవకాశం కల్పించాలని కోరారు.ఈ విషయంపై స్పందించిన వైవి సుబ్బారెడ్డి పై స్థాయి వారితో మాట్లాడి అవకాశం కల్పించటానికి ప్రయత్నం చేస్తామని తెలిపినట్టుగా ఉడుముల కోటిరెడ్డి అన్నారు..
previous post