ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఒందుట్ల గ్రామ పొలాల్లో గురువారం పేకాట స్థావరంపై ఎస్ఐ మాధవరావు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 10.320 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అట్లు తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.
previous post