విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆలోచించలేని పరిస్థితిలో విద్యాశాఖ మంత్రి ఉండటం దురదృష్టకరమని విజయనగరం టీఎన్ఎస్ఎఫ్ నేత ,టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి భానుప్రకాష్ అన్నారు. ఏపీలో కరోనా కేసు లు పెరుగుతున్న దృష్ట్యా విధ్యార్ధులకు సెలవులు పొడిగించాలని డిమాండ్ చేశారు.
పాఠశాలలో ముందస్తు ఏర్పాట్లు లేకుండా యధావిధిగా కొనసాగించటం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమేనని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రుల ఆందోళన దృష్ట్యా సెలవులు పొడిగించాలని టీఎన్ఎస్ఎఫ్ నేత డిమాండ్ చేశారు. 15 ఏళ్ల లోపు లోపు వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాకుండా విద్యార్థులకు పాఠశాలలు నిర్వహించడం దుస్సాహసమే అవుతుందన్నారు.
గతంలో కోర్టులతో మొట్టికాయలు వేయించుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినా విద్యార్థుల విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము లేదన్నారు. విద్యా వ్యవస్థను ఎలా నడపాలో అవగాహన లేని విద్యాశాఖ మంత్రి ,రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండటం దురదృష్టకరమన్నారు.
కరోనా వ్యాప్తి దృష్ట్యా పరిస్థితులు సద్దుమణిగే వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించాలని డిమాండ్ చేశారు. కరోనా విషయంలో ప్రభుత్వ గణాంకాలు రోజురోజుకి పెరుగుతున్నప్పటికి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. మూడో వేవ్ వ్యాప్తి దృష్ట్యా పాఠశాలలో తగిన ఏర్పాట్లు లేకపోవడం వలన విద్యార్థులకు వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువన్నారు. విద్యార్థుల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలు ఆడుకుంటుందోని విమర్శించారు.
పాఠశాలలు యధావిధిగా ప్రారంభించి విద్యార్థులలో కరోనా వ్యాప్తికి కారణం అయితే దానికి బాధ్యత ప్రభుత్వం వహించాలన్నారు. ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడ్డా దాని బాధ్యత ముఖ్యమంత్రి తీసుకుంటాడా? అని ప్రశ్నించారు. విద్యార్థుల పట్ల మూర్ఖంగా ప్రవర్తించే సీఎం దొరకటం కడు శోచనీయన్నారు. పాఠశాలలు యధావిధిగా కొనసాగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని టిఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుందని పోలి మాడుగుల భానుప్రకాష్ తెలిపారు.