ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ జిల్లా కు రైల్వే లైన్ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సొయం బాపురావు ఆధ్వర్యంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిన ప్రతినిధి బృందం కోరింది.
రైల్వే శాఖ మంత్రి దన్వే రావ్ సాహెబ్ దాదా రావు ను నేడు ఈ ప్రతినిధి బృందం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించింది.
ఎంపి బాపురావుతో కలిసి వెళ్లిన ప్రతినిధి బృందంలో ఆదిలాబాద్ జిల్లా BJP OBC మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, జిల్లా నాయకులు దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు GV రమణ తదితరులు ఉన్నారు. తాంసి బస్టాండ్ రైల్వే ఓవర్ బ్రిడ్జి ని తక్షణమే నిర్మించాలని కూడా వారు కోరారు.
ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా మంచిర్యాల్, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లలో రైళ్లు నిలపాలని కూడా వారు కోరారు. తమ డిమాండ్లకు కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సొయం బాపురావు తెలిపారు.