పాలమూరు జిల్లా భూత్పూర్ లో పార్టీ భారీ బహిరంగ సభ….!
తెలంగాణ రాష్ట్రానికి మరోమారు వస్తున్నారు… ప్రధాని మోడీ. అక్టోబర్ ఫస్ట్ న రాష్ట్రంలో ని మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ లో పార్టీ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు హాజరవుతారు.ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం లో ప్రధాని మోడీ… తాజా పర్యటన షెడ్యూల్ ను ఆ పార్టీ అధికార ప్రతినిధి… ప్రేమేందర్ రెడ్డి తెలియజేసారు.సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 1,మధ్యాహ్నం 1గంటలకు షెడ్యూల్ మారింది. అదే రోజు అంటే అక్టోబరు 1, 2023న బహిరంగ సభ మధ్యాహ్నం 1గంటలకు పీఎం మోడీ బహిరంగ సభ ఉంటుందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అన్నారు.
ఈ నెల సెప్టెంబరు 30 కి బదులుగా అక్టోబరు 1వ తేదీ..,మధ్యాహ్నం 1గంటలకు ప్రధాన మోడీ బహిరంగ సభ మహబూబ్ నగర్ జిల్లా భుత్పుర్ ఐ టి ఐ మైదానంలో జరుగనుందన్నారు. ప్రధాన మోడీ బహిరంగ సభకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు , కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభవృద్ధి శాఖా మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారని అన్నారు. ఈ బహిరంగ సభకు పెద్దయెత్తున పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.