అమ్మను మించి దైవమున్నదా అంటూ…ఓ సినీ రచయత అమ్మనుద్దేశించి పాట రాసారు. అమ్మ,నాన్నలే మన ప్రత్యక్ష దైవాలు.దీన్ని సోదని మీరు భావిస్తే…పక్కన పెట్టేసి…వార్తలోకి వద్దాం.దేశ ప్రదాని మోడీ తల్లి హీరాబెన్ వందేళ్లు నిండాయి. స్వయంగా ప్రధాని మోడీనే తన కన్నతల్లి జన్మదిన సందర్బంగా ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ఏపీలోని విజయననగరంలో స్వచ్చ భారత్ కో కన్వనీర్ ,బీజేపీ నేత కుసుమంచి సుబ్బారావు…ప్రదాని మోడీ తల్లి వందో జన్మదినం సందర్భంగా విజయనగరం బీజేపీ నగర కార్యాలయంలో మహిళలకు చీరలు, స్వీట్ లు, బిస్కెట్ లు పంపిణీ చేసారు..
ఈ సందర్భంగా సుబ్బారావు =మాట్లాడుతూ ఈ దేశానికి ఒక గొప్ప దేశభక్తుడుని ప్రధానమంత్రి గా బహుకరించిన మాతృ మూర్తి హీరాబెన్ మోడీ అని అన్నారు. అటువంటి అత్యుత్తమ తల్లి కి విజయనగరం ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసామన్నారు. ఆవిడ వందో పుట్టిన రోజు లో కూడా ఆరోగ్యవంతంగా చలాకీ..గా తన పనులు చేసుకుంటూ…ఆవయస్సులో ఉన్న వారందరికీ ఆదర్శ వృద్దురాలు గా ఉండటం దేశప్రజలతో పాటు ఆమె కన్న కొడుకు ప్రదాని మోడీకి ఎంతో అనందమన్నారు.
అనంతరం నగర అధ్యక్షులు ఇమంది సుధీర్ మాట్లాడుతూ… మోడీ జీ తల్లి హీరాబెన్ మోడీ పుట్టినరోజున ప్రదాని మోడీ….స్వయంగా గుజరాత్ లో ఆమె ఇంటికి వెళ్లి.. తల్లి ఒడిలోనే కాస్సేపు సేద తీరి… కన్నతల్లి పాదాలకు నమస్కరించి.. ఆ ఒక్కరోజు తన తల్లికి వద్దనే గడపడం..యావత్ ప్రపంచానికే స్పూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్షులు కంది సీతారాం, సోము మహేష్, అబ్దుల్ ఆధిల్, జమ్ము రాంబాబు శంకర్ పాల్గొన్నారు.