గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శౌర్య, విశిష్ట సేవా పురస్కారాలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరిని రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పురస్కారాలు వరించాయి. విజిలెన్స్ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి, విజయవాడ ఏసీపీ సుధాకర్కు ఈ పురస్కారాలు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాలకు చెందిన 27 మంది అధికారులకు ఉత్తమ పోలీసు ప్రతిభా పురస్కారాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 15 మంది ఈ పురస్కారాలకు ఎంపిక కాగా, తెలంగాణ నుంచి 12 మంది అధికారులు ఎంపికయ్యారు. వివరాలు: విజయవాడ ఏఎస్పీ అమర్లపూడి జోషి, ఏపీఎస్పీ మంగళగిరి బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ చింతలపూడి రామకృష్ణ, విజయవాడ సీఐడీ డీఎస్పీ ఎం. భాస్కరరావు, విశాఖపట్నం గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ జి. విజయ్కుమార్,
విజయవాడ పోలీస్ కమిషనరేట్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె.జోన్ మోసెస్ చిరంజీవి, నెల్లూరు ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్.గౌరి శంకరుడు, అనకాపల్లి ఏఎస్ఐ పి. విక్టోరియా రాణి, చిత్తూరు ఏఎస్ఐ కేఎన్ కేశవన్, అనంతపురం ఏఆర్ ఎస్ఐ ఎస్. రామచంద్రయ్య, ఒంగోలు సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ ఎల్లిశెట్టి చంద్రశేఖర్, విజయవాడ ఎస్ఐబీ హెడ్ కానిస్టేబుల్ పులిమద్ది విజయభాస్కర్,
విజయనగరం ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నలడింపల్లి రామకృష్ణ, కర్నూలు కానిస్టేబుల్ గద్వాల రామన్న, విశాఖపట్నం రైల్వే కానిస్టేబుల్ సూర్యనారాయణ, విశాఖపట్నం ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణ. కాగా తెలంగాణ నుంచి ఎంపిక అయిన వారి వివరాలు: ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్,
ఆదిలాబాద్ బెటాలియన్ కమాండెంట్ వేణుగోపాల్, స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ డిప్యూటీ కమాండెంట్ ఇక్బాల్ సిద్దిఖి, బీచ్పల్లి బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ పి. సత్యనారాయణ, నిజామాబాద్ టాస్క్ఫోర్స్ ఏసీపీ డి. ప్రతాప్, ఖమ్మం ఏసీపీ జి. వెంకటరావు, నల్గొండ డీఎస్పీ ఎస్. జయరాం, కొండాపూర్ బెటాలియన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎస్. రవీంద్ర నాథ్, హన్మకొండ ఏఎస్ఐ కె. సుధాకర్,
పోలీస్ అకాడమీ ఏఎస్ఐ ఎం. నాగలక్ష్మి, గండిపేట్ ఏఎస్ఐ ఆర్. అనతి రెడ్డి, పుప్పాలగూడ సీనియర్ కమాండో డి. రమేశ్ బాబు, సీఐఎస్ఎఫ్ హైదరాబాద్ బీహెచ్ఈఎల్ యూనిట్ కానిస్టేబుల్ అప్పల రాజు.