28.7 C
Hyderabad
April 27, 2024 03: 32 AM
Slider తెలంగాణ

కేసు: పోలీసులపై దాడి చేసిన రేవంత్ రెడ్డి

reventh

ప్రగతి భవన్ గేట్ టచ్ చేసి చూపించానని చెబుతున్న మల్కాజ్ గిరి ఎంపి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్ రెడ్డిపై కేసు నమోదు అయింది. చలో ప్రగతి భవన్ సందర్భం గా పోలీసుల విధులకు ఆటంకం కల్గించినందుకు రేవంత్ ఫై 351 ,353 ,332  సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రేవంత్ తో పాటు మరో ముగ్గురు అనుచరుల ఫై కూడా ఈ కేసులు నమోదు అయ్యాయి. జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేశారు.రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయడమే కాకుండా ప్రగతి భవన్ ముట్టడి ఎఫెక్ట్ పోలీసులపై కూడా పడింది. ప్రగతి భవన్  ముందు ఇంచార్జ్ గా ఉన్న ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహ రెడ్డి పై వేటు వేశారు. నంద్యాల నరసింహ రెడ్డి ని డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేసిపెట్టారు.

Related posts

హరిత హారంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

కూతురినే కాటేసిన క‌న్న‌తండ్రి… ఫ‌లితం..శ్రీకృష్ణ జ‌న్మ‌స్థానం

Satyam NEWS

అంబర్ పేట చే నంబర్ వద్ద ఒక వైపు రాకపోకలను అనుమతించాలి

Bhavani

Leave a Comment