దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలను రేపటి నుండి తదుపరి ఉత్తర్వుల వరకు మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఉత్తర భారతాన్ని కాలుష్యం నుంచి కాపాడేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
అన్నారు. ఇప్పుడు పక్క పార్టీలపై నిందలు వేయడం, రాజకీయాలు చేయడానికి సమయం కాదని తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పరిస్థితి చక్కబడే వరకు ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. రాజధానిలో సరి-బేసిని మళ్లీ అమలు చేసే విషయం కూడా పరిశీలిస్తున్నారు. అవసరమైతే, సరి-బేసి పథకాన్ని అమలు చేయవచ్చు. ఏ పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా తమ వంతు ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. కాలుష్య నివారణ చర్యలపై ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో ఐదో తరగతి పైబడిన తరగతుల విద్యార్థులకు బహిరంగ ప్రదేశాల్లో క్రీడా కార్యక్రమాలను
నిలిపివేస్తున్నామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో పాల్గొన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ.. పంజాబ్లోని పొలాల్లోని మిగిలిపోయిన పంటను కాల్చివేసే విధానం అరికట్టేందుకు 1.20 లక్షల యంత్రాలను మోహరించినట్లు, గ్రామపంచాయతీలు పొట్టను కాల్చకూడదని తీర్మానం చేసినట్లు చెప్పారు. పంజాబ్లో వరి అధికంగా ఉత్పత్తి కావడం వల్ల పొట్టు పరిమాణం మరింత పెరిగిందని, వచ్చే ఏడాది నవంబర్లోగా పరిష్కారానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. దేశ రాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా, గౌతమ్ బుద్ నగర్లో ఉన్న నోయిడా మరియు గ్రేటర్ నోయిడాలోని అన్ని పాఠశాలల్లో 8వ తరగతి వరకు విద్యార్థులకు వచ్చే మంగళవారం వరకు ఆన్లైన్ అధ్యయనాలకు ఆదేశాలిచ్చారు.