37.2 C
Hyderabad
April 26, 2024 19: 24 PM
Slider పశ్చిమగోదావరి

నాణ్యత లేని గ్రామీణ రహదారులు

ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని కొన్ని ప్రధాన రహదారులు నిర్మాణాలు కొంతమంది కాంట్రాక్టర్లు నాణ్యతా లోపాలతో నిర్మిస్తున్నారని రోడ్డు టాక్స్ లు చెల్లించే వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిలువెత్తు ఉదాహరణ ప్రత్యక్ష నిదర్శనమే ఏలూరు చింతలపూడి రోడ్డు. వంగూరు అడ్డరోడ్ నుండి జానంపేట మధ్యలో ఆర్ అండ్ బి రహదారి నిర్మించిన కొద్దీ రోజులకే అంటే సుమారు 3నుండి 4 నెలల మధ్య కాలం లోనే వేసిన రోడ్డు అట్టలు అట్టలుగా పెచ్చులూడిపోయిందని వాహన దారులు వాపోతున్నారు. ఈ రోడ్ లో ప్రయాణించేటప్పుడు తారు పెచ్చులు లేచిన ప్రాంతంలో రోడ్ ఎత్తు పల్లాలుగా ఉండటంతో వాహనాలు కొన్ని సార్లు అదుపు తప్పుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన రహదారి లో చిప్స్ తో పాటు తారు కూడా పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయినందున రహదారిని సంబంధిత అధికారులు వెంటనే రిపేరు చేయించాలని వారు కోరుతున్నారు.

ఈ రోడ్ కొంత వరకు నిర్మించి కొంత దూరం వదిలేశారు. దీనిపై కూడా అధికారులు స్పందించి రహదారి అభివృద్ధిపనులు త్వరగా చేపట్టాలని వాహన దారులు కోరుతున్నారు.

Related posts

అంగన్ వాడీ ఆయా నే అమ్మగా మారి…

Satyam NEWS

తెలుగుదేశం వాళ్లే మాపై దాడి చేశారు

Satyam NEWS

టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

Satyam NEWS

Leave a Comment