గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు,రాష్ట్ర రైతు అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
నియోజకవర్గ గ్రామాల చర్చిల పాస్టర్స్ అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. ముందుగా నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ వనమా సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ క్రీస్తు మార్గం అనుసరణీయమని, ప్రపంచ మానవాళికి ఏసు క్రీస్తు దేవుడున్నారు. అనంతరం కొవ్వొత్తులు ప్రదర్శించి, సెమి క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ పాస్టర్లు డాక్టర్ చదలవాడను దుశ్శాలువలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దాసరి ఉదయ్ శ్రీ,కొట్ట కిరణ్, మొండితోక రామారావు, డాక్టర్ పోల్లురు కళ్యాణ్ చక్రవర్తి, జాహ్నవి, వెన్న బాలకోటి రెడ్డి, కడియాల రమేష్, మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి ,బండారుపల్లి విశ్వేశ్వరరావు, శ్రీలు బాబురావు,
కుమార్, సికినం అమర్, గుండాల సురేష్, మాతంగి బంగారం, గూడూరు శేఖర్, బీఎస్పీ నాయకులు బుధాల బాబు రావు, మాల మహానాడు నాయకులు గోదా జాన్ పాల్, ఎంఐఎం నాయకులు కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.