తెలంగాణాలో నేడు కొత్తగా 43 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో తెలంగాణ లో ఇప్పటి వరకు 272 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తేలింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం 11 మంది మృతి చెందారు.
పాజిటివ్ కేసుల నుంచి 33 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 228 యాక్టీవ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. అయితే సంతోషించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణా లో కమ్యూనిటీ లోకి కరోనా పోలేదు. మర్కజ్ వెళ్లి వచ్చిన వాళ్లకు, వాళ్ళతో సాన్నిహిత్యం గా ఉన్న వాళ్లకు మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చింది.