విజయనగరం జిల్లా కేంద్ర సర్వజన హాస్పిటల్ మరోసారి వార్తలకెక్కింది.రాత్రి 09.10నిమిషాలకు ఒక్క సారి హాస్పిటల్ లో గాఢాంధకారం అలముకుంది.చిమ్మ చీకటి ఏర్పడింది. రోగుల హాహాకారలతో గగ్గోలు పెట్టసాగారు.అరగంట సేపు హాస్పిటల్ లో విద్యుత్ లేకపోవడంతో… ఇన్ పేషెంట్ల వేదన వర్ణణాతీతం.ఈ హఠాత్ పరిణామం తో…రోగులతో పాటు వైద్య సిబ్బంది కాస్త ఆందోళన కు గురయ్యారు. దాదాపు అరగంట సేపు హాస్పిటల్ లో విద్యుత్ లేకపోవడంతో… ఒక రకంగా ఏమైందో అన్న ఆందోళన, గుబులు రేకెత్తసాగింది.అయితే అరగంటలో కరెంటు రావడంతో పేషెంట్ లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒక్క సారిగా కరెంట్ పోవడానికి కారణం… షాట్ సర్క్యూట్ గా తెలుస్తోంది.
previous post
next post